ఉసిరి

ఉసిరి పండ్లలో ‘సి’ విటమిన్ పుష్కలంగా వుంటుంది. దీనిని వర్షాధారపు పంటగా మెట్ట ప్రాంతాల్లోనూ,  ఏ ఇతర పండ్ల తోటలకు యోగ్యంగాని భూముల్లో బాగా పండించవచ్చు. ఉసిరిని మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాగు చేయవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉసిరి సాగు విస్తీర్ణం 5.67౦ ఎకరాలు. ఉత్పత్తి 4,8౩1 మెట్రిక్ టన్నులు.

ఉసిరి ఉష్ణ ప్రాంతంలోను నీటి ఎద్దడి పరిస్థితిల్లోను బాగా పెరిగి అత్యల్ప, అత్యదిక ఉష్ణోగ్రతలను సమంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు  అదిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ అవసరం. 46 డిగ్రీల  ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది.

నేలలు:
నీరు నిలువ  ఉండని అన్ని రకాల నేల్లలో ఉసిరిని పెంచవచ్చు. ఆమ్ల, క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచవచ్చు. సోడియం శాతం ౩౦, ఉదజని సూచిక 9.5 వరకు వున్న భూముల్లో కూడా ఉసిరిని పండించవచ్చు.

 

రకాలు

బల్వంత్ (ఎన్.ఎ.-1౦):
కాయలు మధ్యస్తం నుండి పెద్ద పరిమాణంలో ఆకర్షనీయంగా వుంటాయి. బరువు 41 గ్రాములు ఉంటుంది.  కాయలు గుండ్రంగా  వుండి చర్మం గరుకుగా లేత ఆకుపచ్చని రంగులో పింక్ వర్ణం మిళితమై వుంటుంది. అయిదారు  సంవత్సరాల  చెట్ల నుండి 42 కిలోల దిగుబడి వస్తుంది.  1౦౦ గ్రాముల కాయ గుజ్జులో 528 మిల్లి గ్రాముల విటమిన్ సి వుంటుంది.

నీలం (ఎన్.ఎ.-7):
కాయలు మధ్యస్తం నుండి పెద్ద సైజులో ఉంటాయి. బరువు - 46 గ్రాములు.  చర్మం నున్నగా వుండి, పండులోని కండ మెత్తగా పీచు లేకుండా వుంటుంది. ఈ రకం నేక్రోసిస్  వ్యాదికి తట్టుకుంటుంది. అయిదారు సం.ల చెట్ల నుండి 5౦ కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 788 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది.

అమ్రిత్ (ఎన్ . ఎ. – 6):
కాయలు మధ్యస్తంగా, నునుపైన చర్మంతో 6 చారలు కలిగి ౩5 – ౩7 గ్రాముల బరువు కలిగి వుంటాయి. జాం, క్యాండీ వంటి పదార్ధం తయారికి అనుకూలం. అయిదారు సంవత్సరాల చెట్ల నుండి ౩5 – 40  కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 707 మిల్లి గ్రాముల విటమిన్’సి’ వుంటుంది.

కాంచన్ (ఎన్.ఎ.-4):
పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు, మధ్యస్తంగా వుంది, ౩0 – ౩2 గ్రాముల బరువు కలిగి వుంటాయి.  కాయలు కార్కింగ్ తట్టుకోలేవు. 10౦ గ్రాముల కాయగుజ్జులో 711 మిల్లి గ్రాముల  విటమిన్- ‘సి’ వుంటుంది. ఐదారు సంవత్సరాల చెట్ల నుండి ౩0 –  ౩8 కిలోల  దిగుబడి వస్తుంది. ఉరగాయకు ఎక్కువ కాలం నిలువ వుంచగలిగిన రకం.

కృష్ణ (ఎన్.ఎ.-5);
కాయలు మధ్యస్తంగా, ౩5 గ్రాముల బరువు కలిగి వుంటాయి. 100 గ్రాముల గుజ్జులో 549 మిల్లి గ్రాముల  విటమిన్ ‘సి’ వుంటుంది. ఐదారు సంవత్సరాల చెట్ల నుండి ౩౦-౩5 కిలోల దిగుబడి వస్తుంది (వర్షాధారంగా).

చక్కియా;
తెలుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు,  మధ్యస్తంగా ౩౩-౩5 గ్రా. బరువు కలిగి వుంటాయి. ఎక్కువ పీచు వుండి 100 గ్రాముల కాయగుజ్జులో 789 మిల్లి గ్రాముల విటమిన్ – ‘సి’ వుంటుంది. నిటారుగా పెరిగే లక్షణం వుండటం వల్ల దీనిని అధిక సాంద్రత ఉన్న చోట కూడా నాటవచ్చు. ఐదు సంవత్సరాల చెట్ల నుండి ౩౦ కిలోల దిగుబడి వస్తుంది. ఈ రకం పరపరాగ సంపర్కానికి బాగా అనుకూలం. పచ్చళ్ళ తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.

బి.ఎస్.ఆర్. -1;
ఇది తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంచే రూపొందించింది. ఇది అన్ని ప్రాంతాల్లో పండించేందుకు అనుకూలం. కాయ సైజు చిన్నగా వుండి పింక్ రంగులో వుంటుంది. 12 – 14 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 100 గ్రాముల కాయ గుజ్జులో 650 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది. ఐదు సంవత్సరాల చెట్టు 40 – 45 కిలోల ఉత్పత్తినిస్తుంది. 10 సంవత్సరాల వయస్సులో  దిగుబడి 15౦ కిలోల చేరుకుంటుంది.

లక్ష్మి - 52: 
కాయలు 40 – 60 గ్రాముల బరువుంటాయి.  100 గ్రాముల కాయగుజ్జులో 512 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది. ఈ రకం క్యాండీ, మురబ్బ తయారికి అనువైనది. 1౦ సంవత్సరాల వయసు చెట్ల నుండి 200 – 250 కిలోల దిగుబడి వస్తుంది.

 

నేల తయారి
భూమిని మెత్తగా దున్ని చదును చేయాలి. మే – జూన్ మాసాలలో 100 మీటర్ల లోతైన గుంతలు తవ్వాలి. వర్షాధారంగా సాగు చేస్తే ఎకరాకు 60 మొక్కల చొప్పున 88 మీటర్ల దూరంలో నాటాలి.  నీటివసతి (డ్రిప్) కింద ఎకరాకు 110 మొక్కల చొప్పున 66 మీటర్ల దూరంలో నాటుకోవాలి. మెత్తని పై మట్టితో పాటు 15 కిలోల పశువుల ఎరువు, కిలో సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతలు నింపి జూలై, సెప్టెంబర్ లలో నాటుకోవాలి. నాటేటప్పుడు అంటుభాగం భూమికి 10 – 20 సెంటి మీటర్లు పైన ఉండేటట్లు నాటాలి.  గుంతకు ౩౦ గ్రాముల  ట్రేకోడెర్మ పౌడర్ వేసుకోవాలి.

 

విత్తడం / నాటటం:
మొక్కల ఎంపిక:
శాఖీయోత్పతీ చెట్లనే (మొగ్గంట్లు) లేదా వేడ్జే అంటు పద్ధతిలో  తయారు చేసిన అంటు మొక్కలను మాత్రమే నాటుకోవాలి. ఉసిరి విత్తనం ఏక పిండోత్ప్దాకం. దాని నుండి వచ్చిన చెట్లు తల్లి పోలికలు కలిగి వుండవు. కాబట్టి విత్తన ప్రవర్ధనం చేయరాదు. శాఖీయోతప్తి ద్వార ప్రవర్ధనం చేసిన మొగ్గ అంట్లు త్వరగా కాపుకొస్తాయి. కావున పంటపై ఖర్చును తగ్గించుకోవచ్చు. నాణ్యమైన ఒకే  మాదిరి పంట నుండి మంచి ధర పొందవచ్చు. సాఖీయోతప్తి వలన కొన్ని చెదపీదల నుండి పంటను కాపాడవచ్చు.

వేరు  మూలం మీద పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. నాటిన మొక్కలకు వెదురు కర్రతో ఊతం ఇవ్వాలి. చౌడు భూముల్లో సాగు చేసేటప్పడు 8 – 10 కిలోల జిప్సంతో గుంతలను పూడుచుకోవాలి. ఒకే రకాన్ని కాకుండా రెండు లేదా మూడు రకాలను ఒకటి విడిచి ఒక దాన్ని వరుసల్లో నాటుకొన్నట్లయతే పరపరాగ సంపర్కం ద్వారా బాగా కాయ పట్టి మంచి దిగుబడి వస్తుంది.

 

నీటి యాజమాన్యం:

ఉసిరి మొండిజాతి చెట్టు. నీటి ఎద్దడిని చాలవరకు తట్టుకొంటుంది. కాని నీటి యాజమాన్యాన్ని పాటిస్తే మొక్కలలో పెరుగుదల బాగుండి ఎక్కువ  దిగుబడులు పొందవచ్చు. మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి సరైన మోతాదులో నీరిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. ఒక్కో మొక్కకు రోజుకు 50 లీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది.

అంటు మొక్కలు నాటిన తరువాత ఒక నెల వరకు రోజు విడిచి రోజు నీరివ్వాలి. ఆ తరువాత మూడు నాలుగు  నెలల  వరకు మూడు, నాలుగు రోజులకొకసారి నీటిని పారించాలి. ఎండాకాలంలో మాత్రం 4-5 రోజుల కొకసారి నీరివ్వాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లకు నవంబర్- డిసెంబర్ మాసాల్లో బెట్ట పరిస్థేతులు కల్పించడం మంచిది. లేకపోతే పూత సరిగా రాదు.  డ్రిప్ పద్దతి ద్వారా నీరిస్తే ౩౦-4౦ శాతం నీటిని అదా చేయవచ్చు. డ్రిప్ పద్దతిలో చెట్లు త్వరగా పెరిగి అధిక దిగుబడులు ఇస్తాయి. దీని కోసం సాగు చేసేటప్పుడు చెట్లు నాటిన తరువాత ప్రతి చెట్టుకు ఒక కుండను అమర్చాలి. కుండ క్రింది భాగాన సన్నని రంధ్రం చేసి  రంధ్రంలో గుడ్డ ఒత్తిని  అమర్చాలి. కుండ నిండా నీరు పోసి నీరు ఆవిరి అయిపోకుండా పైన మూత పెట్టాలి. ఇట్లా చేయడం వల్ల తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను బతికించుకోవచ్చు. వర్షాధారపు పండ్ల తోటలకు పాదుల్లో వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా ఇంకేదైనా ఆకు పొట్టులతోనయినా 5 సెంటి మీటర్ల  మందం మల్చింగ్ చేసుకోవాలి. వరుసల మధ్య 5 శాతం వాలును కల్పించి చెట్లకు వర్షపు నీటిని మళ్చాలి.

 

ఎరువులు / పోషకాల యాజమాన్యం ;

మొక్క వయసును  బట్టి ఉసిరిలో ఎరువులు వేయాలి. మొదటి సంవత్సరం చెట్టుకు 1౦౦ గ్రాముల నత్రజని, 5౦ గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులతో బాటు 1౦ కిలోల పశువుల ఎరువును వేయాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం 1౦౦ గ్రాముల నత్రజని, 5౦ గ్రాముల భాస్వరాన్ని , 1౦౦ గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులని, 5 కిలోల పశువుల ఎరువును  పెంచుకుంటూ పోవాలి.  10వ సంవత్సరంలో చెట్టుకి కిలో నత్రజని, అర కిలో భాస్వరం, కిలో పోటాష్ నిచ్చే ఎరువులతో బాటు 60 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి.

మూడవ సంవత్సరం చెట్ల నుండి పంటను తీసుకోవచ్చు. కాపుకు వచ్చిన చెట్లకు వయసును బట్టి చెప్పబడిన  ఎరువుల మోతాదులను రెండు సమభాగాలుగా  చేసి మొదటి భాగాన్ని కొత్త చిగురులు వచ్చేటప్పుడు (జనవరి-పిబ్రవరి నెలల్లో), రెండవ  భాగాన్ని పశువుల ఎరువుతో వర్షాకాలంలో (జూలై నెలలో) వేసి మట్టిలో పూడ్చి నీటిని ఇవ్యాలి. చెట్లలో బోరాన్ లోప నివారణకు లీటర్  నీటికి 6 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారి చేయాలి. పండ్లు గచ్చకాయ పరిమాణం ఉన్నప్పుడు 10 గ్రాముల యూరియాను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి పండు పరిమాణాన్నిపెంచవచ్చు.

 

కలుపు యాజమాన్యం

కొమ్మ కత్తిరింపులు
ఉసిరి కొమ్మలు ఎక్కువకాయలను కలిగి వుండి పెలుసుగా వుండటం వల్ల తరచుగా విరిగిపోతుంటాయి. అందువల్ల కొమ్మ కత్తిరింపులు తప్పనిసరి. నాటిన తరువాత పక్క కొమ్మలను తీసివేస్తూ ఒక మీటర్ వరకు నిటారుగా పెరగనిచ్చి తల కొన భాగాన్ని కత్తిరించాలి. అక్కడ నుండి సుమారు 4 నుండి 6 పక్క కొమ్మలు చెట్టు మొదలకు నాలుగు వైపుల సమదూరంలో పెరిగేటట్లు చూడాలి. ఎక్కువగా వుండే అవసరం లేని  కొమ్మలను తీసివేయాలి.  కొమ్మలను కాపు కోసిన తరువాత ఎక్కువ ఎత్తుకు పెరగకుండా కత్తిరించుకోవాలి. (నవంబర్- డిసెంబర్ నెలలో)

అంతర పంటలు;
ఉసిరి చెట్లకు 8 సం.ల వయసు వచ్చే వరకు వేరుశనగ, పేసర, అలసంద, ఉలవ లాంటి వాటితోపాటు సుగంధ తైలాన్నిచే నిమ్మ గడ్డి, పన్నీరు పంటలు లేదా పాషాణబేధీ, అశ్వగంధ, నీలవేము,, నీల ఉసిరి  మొదలగు ఓషధ పంటలను కూడా అంతర పంటలుగా సాగు చేయవచ్చు.